Daily Current Affairs in Telugu 8th July 2022 – {డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో} Leave a Comment / Current Affairs / By admin Daily Current Affairs in Telugu Article the total information for APPSC, TSPSC, GROUPS, RAILWAYS, SSC, AND BANKING about Day-to-day issues Happening Around the world-Wild. Table of Contents ఆక్సాయ్చిన్ లక్ష్యంగా చైనా జీ695 హైవేపెలోసీపై చైనా ఆంక్షలుఆఫ్రికాలో పదేళ్లు పెరిగిన సగటు జీవితకాలంజాతీయంకురుక్షేత్రలో ఆసియాలోనే ఎత్తైన గుడిసైన్స్ అండ్ టెక్నాలజీసాంకేతిక సమస్యతోనే ఎస్ఎస్ఎల్వీ విఫలంగుండెపోటు, క్యాన్సర్ను గుర్తించే సరికొత్త ఆర్థిక రంగంమతపరమైన లేదా ట్రస్టులకు చెందిన అద్దె గదులకు జీఎస్టీ నుంచి మినహాయింపునియామకాలుసీఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీగా కలైసెల్విఅమెరికాలో అప్పీల్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ అవార్డులుమిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్క్రీడలుశాఫ్ ఫుట్బాల్ టైటిల్ భారత్ సొంతంకామన్వెల్త్ క్రీడలు: శ్రీశంకర్కు లాంగ్జంప్లో రజతంకామన్వెల్త్ క్రీడలు: పవర్లిఫ్టర్ సుధీర్కు స్వర్ణంఅండర్-20 అథ్లెటిక్స్లో రూపల్ చౌదరి రికార్డు ఆక్సాయ్చిన్ లక్ష్యంగా చైనా జీ695 హైవే సరిహద్దుల్లో తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా మరో దుందుడుకు చర్యకు సిద్ధమైంది. టిబెట్, జిన్జియాంగ్ను కలుపుతూ జీ695 పేరిట హైవే నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నది. ఈ నిర్మాణం పూర్తయితే భారత్కు కీలకమైన తూర్పు ఆక్సాయ్ చిన్, పాంగాంగ్ త్సో సరస్సు తదితర ప్రాంతాలు చైనా నిఘా పరిధిలోకి వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1957లో జీ219 హైవే నిర్మాణం తర్వాత అదేస్థాయి రహదారిని చైనా మళ్లీ నిర్మించాలనుకుంటుండటం గమనార్హం పెలోసీపై చైనా ఆంక్షలు తాము ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా తైవాన్లో పర్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. ఆమె, ఆమె కుటుంబసభ్యులు చైనాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని, అలాంటప్పుడు తమ అనుమతి లేకుండా పెలోసీ ఎలా పర్యటిస్తారని ప్రశ్నించింది. తమ ఆదేశాలను ధిక్కరించడమంటే చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వెల్లడించింది. అలాగే అమెరికాతో రక్షణ, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై చర్చలనూ రద్దు చేసుకుంటున్నామని తెలిపింది ఆఫ్రికాలో పదేళ్లు పెరిగిన సగటు జీవితకాలం ఆఫ్రికా ప్రాంతంలో మనిషి సగటు జీవిత కాలం పదేళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు ఆ మార్పును గమనించినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఇదే కాలంలో మరే ప్రాంతంలోనూ ఈ స్థాయిలో సగటు జీవితకాలం పెరగలేదని డబ్ల్యూహెచ్వో చెప్పింది. కానీ తాజాగా కోవిడ్ వల్ల జీవితకాలంపై ప్రభావం పడి ఉంటుందని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. ట్రాకింగ్ యూనివర్సల్ కవరేజ్ ఇన్ ఆఫ్రికా రీజన్ 2020 పేరుతో డబ్ల్యూహెచ్వో ఓ నివేదికను రిలీజ్ చేసింది. ఆఫ్రికాలో ఆరోగ్యకరమైన వ్యక్తి సగటు జీవితకాలం 2000 సంవత్సరంలో 46 ఏళ్లు కాగా, ఆ జీవితకాలం 2019లో 56కి పెరిగినట్లు రిపోర్ట్ వెల్లడించింది జాతీయం కురుక్షేత్రలో ఆసియాలోనే ఎత్తైన గుడి భగవద్గీత బోధనలకు అనుగుణంగా ఆసియాలోనే తొలి, అతిఎత్తైన దేవాలయాన్ని హరియాణాలోని కురుక్షేత్రలో నిర్మిస్తున్నారు. 260 అడుగుల ఎత్తుతో 18 అంతస్తులను బ్రహ్మ సరోవర్ నది ఒడ్డున జ్ఞాన్ మందిర్ పేరిట నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయాన్ని మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ఆశ్రమ ట్రస్టు నిర్వాహకులు దేవాలయ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. కురుక్షేత్ర అభివృద్ధి బోర్డు ఈ భూమిని విరాళంగా ఇచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీ సాంకేతిక సమస్యతోనే ఎస్ఎస్ఎల్వీ విఫలం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగం విఫలమైంది. శాటిలైట్ల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అవి పనికిరావని ఇస్రో ప్రకటించింది. దీంతో ఎస్ఎస్ఎల్వీ తొలి మిషన్ మూడు దశలు సాఫీగానే సాగిన, చివరి దశలో సమాచార జాప్యంతో మిషన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని పేర్కొన్నారు. ఉపగ్రహాన్ని నిర్ధారిత కక్ష్యలోకి చొప్పించే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వీటీఎం), టెర్మినల్ దశలో కాల్పులు జరపకపోవడంతో వైఫల్యానికి కారణమని పేర్కొన్నారు గుండెపోటు, క్యాన్సర్ను గుర్తించే సరికొత్త పరీక్ష గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించేందుకు వీలుగా అమెరికా, బ్రిటన్, జర్మనీకి చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సులువైన పరీక్షను అభివృద్ధి చేసింది. క్రిస్పర్జైమ్ అనే ఈ పరీక్ష.. శరీరంలోని బయోమార్కర్ల (కణాలు విడుదల చేసే సిగ్నళ్లు)ను గుర్తించడం ద్వారా పనిచేస్తుంది. కొవిడ్-19 కారక సార్స్ సీవోవీ-2 జన్యువులను గుర్తించేందుకు ఇప్పటికే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అయితే కొవిడ్ వంటి సాంక్రమిక వ్యాధుల్లోనే కాకుండా అసాంక్రమిక వ్యాధులకు సంబంధించి కూడా బయోమార్కర్లను కణాలు విడుదల చేస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ను రక్తంలో కనుక గుర్తిస్తే ఆ వ్యక్తిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిర్ధారించవచ్చు ఆర్థిక రంగం మతపరమైన లేదా ట్రస్టులకు చెందిన అద్దె గదులకు జీఎస్టీ నుంచి మినహాయింపు మతపరమైన లేదా ఛారిటబుల్ ట్రస్టుల ద్వారా నిర్వహించబడే సముదాయాలకు చెందిన గదుల అద్దెపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది. గత నెలలో కేంద్రం గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన క్రమంలో దీనిపై చాలామందికి సందేహాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి సమీపంలోని సత్రాల్లో అద్దె గదులపై జీఎస్టీ వసూలు చేయడం ప్రారంభించారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పన్ను మినహాయింపు కోరుతూ లేఖలు వచ్చాయి. దీంతో కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు(సీబీఐసీ) ఈ వ్యవహారంపై స్పష్టత ఇచ్చింది నియామకాలు సీఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీగా కలైసెల్వి దేశంలోని 38 ప్రతిష్ఠాత్మక వైజ్ఞానిక పరిశోధనా సంస్థలతో కూడిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కలైసెల్వి నియమితులయ్యారు. దీంతో ఈ బాధ్యతలను చేపట్టనున్న తొలి మహిళగా ఆమె నిలవనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేండ్లపాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ పొందిన శేఖర్ మండే స్థానంలో కలైసెల్వి నియామకం జరిగింది. మండే రిటైర్మెంట్ తర్వాత బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేశ్ గోఖలేకి అదనంగా సీఎస్ఐఆర్ బాధ్యతను అప్పగించారు అమెరికాలో అప్పీల్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ అమెరికాలోని అప్పీల్ కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన రూపాలీ హెచ్ దేశాయ్ ఎన్నికయ్యారు. అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన నైన్త్ సర్క్యూట్ ఆప్పీల్స్ కోర్టు జడ్జిగా ఆమె నియమితురాలయ్యారు. 67-27 ఓట్ల గెలుపుతో దేశాయ్ను సెనేట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో దక్షిణాసియాలోనే ఈ ఘనత సాధించిన తొలి జడ్జిగా ఆమె రికార్డు సృష్టించారు. అవార్డులు మిస్ ఇండియా యూఎస్ఏగా ఆర్య వాల్వేకర్ భారతీయ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ మిస్ ఇండియా యూఎస్ఏ-2022 కిరీటాన్ని దక్కించుకున్నారు. 18 ఏండ్ల ఈ యువతిది వర్జీనియా రాష్ట్రం. న్యూజెర్సీలో నిర్వహించిన ఈ పోటీల్లో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ప్రీ మెడికల్ సెకండియర్ విద్యార్థిని సౌమ్యశర్మ ఫస్ట్ రన్నరప్గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్ రన్నరప్గా నిలిచారు. వాషింగ్టన్ రాష్ర్టానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్కు చెందిన తన్వీ గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్నారు క్రీడలు శాఫ్ ఫుట్బాల్ టైటిల్ భారత్ సొంతం శాఫ్ అండర్-20 ఫుట్బాల్ టైటిల్ను ఆతిథ్య భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్లో అదనపు సమయంలో భారత్ 5-2 గోల్స్తో బంగ్లాదేశ్ను ఓడించింది. ఈ మ్యాచ్లో గుర్కీరత్ ఒక్కడే నాలుగు గోల్స్ చేయడం విశేషం. కామన్వెల్త్ క్రీడలు: శ్రీశంకర్కు లాంగ్జంప్లో రజతం కామన్వెల్త్ క్రీడల పురుషుల లాంగ్జంప్లో రజతం నెగ్గిన తొలి భారత అథ్లెట్గా శ్రీశంకర్ రికార్డు సృష్టించాడు. ఈ 23 ఏళ్ల అథ్లెట్ అయిదో ప్రయత్నంలో 8.08 మీటర్ల ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచాడు. స్వర్ణం నెగ్గిన బహమాస్ అథ్లెట్ లకాన్ కూడా అంతే దూరం దూకాడు. కానీ రెండో ఉత్తమ ప్రదర్శనలో అతని (7.98మీ) కంటే శ్రీశంకర్ (7.84మీ) వెనకబడడంతో పసిడి దక్కలేదు. కామన్వెల్త్ క్రీడలు: పవర్లిఫ్టర్ సుధీర్కు స్వర్ణం భారత పారా పవర్లిఫ్టర్ సుధీర్ కుమార్ పురుషుల హెవీ వెయిట్ విభాగంలో స్వర్ణం గెలిచాడు. ఈ విభాగంలో తొలి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తిన 27 ఏళ్ల సుధీర్.. తర్వాత 212 కేజీలు లిఫ్ట్ చేశాడు. ఆపై 217 కేజీలు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. మొత్తం మీద 134.5 పాయింట్లతో క్రీడల రికార్డును సృష్టిస్తూ సుధీర్ పసిడి గెలుచుకున్నాడు. క్రిస్టియన్ (నైజీరియా, 133.6 పాయింట్లు) రజతం గెలవగా, మికీ యూల్ (స్కాట్లాండ్, 130.9 పాయింట్లు) కాంస్యం సాధించాడు. అండర్-20 అథ్లెటిక్స్లో రూపల్ చౌదరి రికార్డు అండర్-20 ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్గా రూపల్ చౌదరి రికార్డు సృష్టించింది. ఇప్పటికే 4్ఠ400 మీటర్ల రిలే పరుగులో రజతం గెలిచిన జట్టులో సభ్యురాలైన రూపల్.. తాజాగా 400 మీటర్ల వ్యక్తిగత పరుగులో కాంస్యం దక్కించుకుంది. ఈ రేసును ఆమె 51.85 సెకన్లలో ముగించి.. యెమి మేరీ (51.50 సె–గ్రేట్ బ్రిటన్), దమరిస్ ముతుంగ (51.71 సె–కెన్యా)ల తర్వాతి స్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో రూపల్ 52.27 సెకన్లతో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా, షాపూర్ జైన్పూర్ అనే పల్లెటూరికి చెందిన 17 ఏళ్ల రూపల్.. సాధారణ రైతు కుటుంబం నుంచి అథ్లెటిక్స్లోకి అడుగు పెట్టి ప్రపంచ స్థాయికి ఎదిగింది. 2018లో హిమదాస్ స్వర్ణం గెలిచాక అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ 400 మీ. పరుగులో పతకం నెగ్గిన క్రీడాకారిణి రూపలే.